కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ల తీరు బాధించింది

సిరా న్యూస్,అమరావతి;
సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అయన కీలక వ్యాఖ్యలు చేసారు. గడచిన 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ ల తీరు చాలా బాధించింది. ఐఏఎస్, ఐపీఎస్ లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. 1995 నుంచి పలు దఫాలుగా సీఎంగా ఉన్నా. ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదు. గడచిన 5ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్ లతో సమావేశం అవుతా అని అన్నారు. ప్రవీణ్ ప్రకాష్, శ్రీ లక్ష్మీ, పి ఎస్సార్ ఆంజనేయులు ఇచ్చిన పుష్పగుచ్చాలను చంద్రబాబు తిరస్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *