సిరా న్యూస్,హైదరాబాద్;
అద్దెకు కార్లను అందించే లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులను బంధించి చావబాదిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చేస్తే తమ దగ్గర ఉద్యోగం చేయాలి.. లేదంటే చావు దెబ్బలు తినాలి.. ఇదే లాంగ్ డ్రైవ్ కార్స్ తీరు. ఉద్యోగం పేరుతో అభం శుభం తెలియని యువతులను మభ్యపెట్టి లోబర్చుకుంటారు. అడ్డు చెబితే వేధింపంలు చిత్రహింసలు, యువకుల పరిస్థితి మరీ దారుణం. మాట వినకపోతే చచ్చెట్టు కొడతారు. బాధితులు బయటకు వచ్చి చెప్పటానికి భయం తో వణికిపోతున్నారు అంటే పరిస్థితి వారి అర్ధంచేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని కొప్పుల హరిదీప్ రెడ్డి నిర్వాకం చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం షాకవుతున్నారు.లాంగ్ డ్రైవ్ కార్స్.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ కార్లను అద్దెలకు అందించే సంస్థ అనే విషయం గుర్తొస్తుంది. కానీ వ్యాపారం ముసుగులో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల దారుణాలు, ఉద్యోగులను బంధించి దాడి చేసిన ఘటనతో బయటపడ్డాయి. లాంగ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్ మహానగరం శివారు మేడిపల్లి బ్రాంచ్లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్గా పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు జీతాలు సరిపోక జాబ్లు వదులుకున్నారు. అలా లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు తమ సొంతంగా స్టార్టప్ కు ప్లాన్ చేశారు.ఈ విషయం తెలుసుకున్న లాంగ్ డ్రైవ్స్ కార్ ఓనర్ కొప్పుల హరిదీప్ రెడ్డి.. గత ఉద్యోగులంతా కొత్తగా పెడుతున్న స్టార్టప్ కంపెనీపై దాడి చేశాడు. దాదాపు ముప్పై మంది అనుచరులతో కలిసి 8 మంది ఉద్యోగులపై దాడికి తెగబడ్డారు. చేతికి దొరికిన వస్తువులతో చావబాదాడు. మేడిపల్లిలోని పలు ప్రాంతాలు తిప్పుతూ రాత్రి రెండు మూడు గంటల వరకు అమ్మాయిలను, అబ్బాయిలను బంధించి కొట్టారు. కాగా, ఇప్పటికీ తేజ అనే యువకుడి ఆచూకీ లభించకపోవడంతో వారి చెర నుండి బయటపడి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.దాడిలో తీవ్ర గాయలపాలయిన వారిని చూసి వైద్యులే షాక్ అయ్యారు. ఈ ఘటన అనంతరం దాడి నుంచి బయటపడిన యువతీ యువకులు తమపై జరిగిన పైశాచికత్వంపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రస్తుతం లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్ హరిదీప్ రెడ్డి తో పాటు దాడికి తెగబడిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దాడికి గురైన వారిలో తేజ అనే యువకుడి ఆచూకి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు.ఇక లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల దాడులతో వారి చీకటి బాగోతాలను బయట పెట్టారు బాధిత యువతులు. అమ్మాయి బాగుంటే విద్యార్హతతో పని లేకుండా ఉద్యోగమిచ్చి ఆ తరువాత లోబరుచుకునే ప్రయత్నం చేస్తారని, అడ్డు చెబితే లైంగిక వేధింపులకు గురించేస్తారని వాపోయారు. ఆ కంపెనీలో సాయి తరుణ్, ఒబెదు, నితిన్, యోగి, రిషిత, మధుమితలు గత కొన్ని నెలలుగా పని చేస్తున్నారు. కాగా వీరికి నెలకు రూ. 15 వేల జీతం ఇచ్చేవారు. అయితే విధులకు గంట ఆలస్యమైనా….జీతంలో రూ.500 కోత విధిస్తూ ఉండడంతో వారిలో ఒక యువతి పని మానేసింది. ఇటీవల కంపెనీ వద్దకు వచ్చిన ఆమె తన స్నేహితులతో మాట్లాడింది. మాట్లాడిన మరుసటి రోజు నుంచి వారు కూడా ఆ కంపెనీలో పని మానేశారు.దీంతో యజమాని కొప్పుల హరుదీప్ రెడ్డి సిబ్బందిని మంగళవారం ఆఫీసుకు పిలిపించాడు. అనంతరం ఎందుకు ఉద్యోగం మానేశారు అంటూ వారితో వాగ్వాదానికి దిగిన హరిదీప్ రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గంటల తరబడి కంపెనీ ఆఫీసులో వారిని చిత్రహింసలకు గురి చేసి ఇద్దరి మహిళలను మంగళవారం మధ్యాహ్నం వదిలి వేయగా.. మిగతా వారిని మంగళవారం రాత్రికి వదిలేశారు. దీంతో బాధితులు తమ బంధువులు, స్నేహితులకు సమాచారం అందించి వారి సాయంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఒక గిరిజన మహిళ కూడా ఉండగా…..ఆమెను కులం పేరుతో కొప్పుల హరిదీప్ రెడ్డి దూషించడాని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వారికి కుల సంఘాలు మద్దతు తెలిపాయి. మంగళవారం నిందుతుడు హరిదేప్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, కుల సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి డిమాండ్ చేశారు. మరోవైపు గిరిజన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు. కాగా కొప్పుల హరిదీప్ రెడ్డి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు. అతడు ప్రస్తుతం ఆత్మకూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు.జాబ్ లో జాయిన్ అయిన కొన్నాళ్ళకే లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొప్పుల హరిదీప్ రెడ్డితో పాటు అతని అనుచరులు అమ్మాయిలతో లాంగ్ టూర్లు ప్లాన్ చేసి మద్యం తాగేలా బలవంతం చేస్తారని, ఆ తరువాత వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. భయంకర వాస్తవాలు బయట పెట్టారు బాధితులు.కొప్పుల హరిదీప్ రెడ్డి తో పాటు దాడికి తెగబడిన అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతున్నారు. లేకపోతే తమ ప్రాణాలకు రక్షణ ఉండదు అంటున్నారు బాదితులు. అంతేకాదు సమగ్ర దర్యాప్తు జరిపితే లాంగ్ డ్రైవ్ యాజమాన్యం అరాచకాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.