సిరా న్యూస్,ఔరంగాబాద్;
మహారాష్ట్రలోని వైన్ గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఘటనలో ఆరుగురు మహిళలు గల్లంతు కాగా ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం అయ్యాయి. చాముర్సి తాలుక ఘణపూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరప పంటలో ఏరివేత కు వెళ్తుంటారు. గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగాపూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.ఏడుగురు వ్యవసాయ కూలీలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.అయితే, పడవ నడుపుతున్న వ్యక్తి ఈదుకుంటూ ఒక్క మహిళను ఒడ్డుకు చేర్చాడు. ఇక మరో 6 గురు గల్లంతు అయ్యారు. మృతులు జీజాబాయి రౌతు(55), పుష్ప జాడే(42) మృత దేహాలను బయటకు తీసారు. గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..