మృతదేహం కలకలం

సిరా న్యూస్,చీరాల;
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభుని పేట లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానిక పద్మనాభ పేట కు చెందిన రాంబాబు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం నిమిత్తం గత రెండు రోజులుగా ఇసుక తోలించాడు. ఈ రోజు ఉదయం ఆ ఇసుక చదును చేస్తుండగా సుమారు 45 సంవత్సరాల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇసుకలో మృతదేహం కనిపించింది.దీనితో పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఇసుక మండలం లోని బోయినవారిపాలెం శివారు ప్రాంతం నుండి తీసుకు వచ్చినట్లు గుర్తించారు.మృతదేహం కు తల భాగం పూర్తిగా లేకపోవడం తో ఒంటి పై ఉన్న దుస్తుల ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నట్లు గ్రామీణ సి.ఐ సత్యన్నారాయణ తెలిపారు.ల
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *