నాలాలో శవమై తేలిన మైనర్ కేసులో విస్తుపోయే నిజాలు
మిస్టరీ ఛేదించిన జూబ్లీహిల్స్ పోలీసులు
పోక్సో కేసు నమోదు.
సిరా న్యూస్,జూబ్లీహిల్స్;
: వెంకటగిరిలోని నాలాలో బుధవారం బాలుడి మృతదేహం లభ్యమైన ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది ప్రమాదం కాదని ఆదివారం తెలిపారు. లైంగిక దాడి తర్వాత బాలుడు హత్యకు గురైనట్టు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారా లతో నిందితుడి పట్టుకున్న పోలీసులు విచారణలో ఈ విస్తుపోయే నిజాలు తెలిశాయి.
వివరాల్లోకి వెళితే…
నగ రంలోని వెంకటగిరి పరిధి దుర్గభవాని నగర్ లో కార్తీక్ (10) ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి నాగర్ కర్నూలు కు చెందిన రమవత్తు మన్యం (45) వచ్చాడు. ఫిబ్రవరి 13 రాత్రి సమీప పార్క్ కార్తీక్ ఆడు కుంటుండగా.. మద్యం మత్తులో బాలునిపై మన్యం లైంగిక దాడికి ప్రయత్నించాడు. భయంతో కార్తీక్ అరవగా.. అతని నోటిని మూసి, గొంతు నులిమి పక్కనే ఉన్న నాలాలో పడేశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు