బస్సు ఓవర్ లోడ్..చేతుల్లేత్తేసిన డ్రైవర్

సిరా న్యూస్,హుజూరాబాద్;
రాష్ట్రం లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతం గా పెరిగింది.ఒక్క బస్సులో 55 మంది కేపాసిటి ఉంటే 110 మంది ప్రయాణికులు ఎక్కుతుండడం తో నేను ఓవర్ లోడ్ తో వెళ్ళలేనని సైడ్ మిర్రర్ కనపడడం లేదని నడి రోడ్డు పై బస్సు ఆపి తన ఆవేదన వ్యక్తం చేశాడో ఆర్టీసీ డ్రైవర్..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్ స్టాండ్ లో సిరిసిల్ల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళుతుండగా హుజూరాబాద్ బస్ స్టాండ్ కు చేరుకుంది.అప్పటికే ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు హుజూరాబాద్ లో చాలా సేపటి నుండి బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణీకులు బస్సులో స్థలం లేకున్నా ఎక్కేశారు బస్సు కేపాసిటీ కి మించి నూట పది మంది ఎక్కడం తో బస్ స్టాండ్ నుండి బస్సు తీసుకొని బయటికి వెళ్ళిన డ్రైవర్ కు సైడ్ మిర్రర్ కనపడక నడిపే పరిస్థితి లేక నడి రోడ్డు పై బస్సును ఆపేశాడు.సైడ్ మిర్రర్ కనపడక ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దయచేసి కొంత మంది దిగాలని ప్రయాణికులను కోరగా కొంతమంది దిగడం తో బస్సును యదావిధిగా వరంగల్ తీసుకెళ్ళాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *