ఆర్ధాంతరంగా బస్సును ఆపేశారు

 సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. 36 మంది ప్రయాణికులతో వైజాగ్ నుండి హైదరాబాద్ వెళుతుండగా అర్ధరాత్రి 2 గంటలకు ఎలిగన్స్ ట్రావెల్ బస్సు ఆగిపో్యింది. ఏమైందో చెప్పకుండా బస్సు వదిలి డ్రైవర్, క్లినర్ వెళ్లిపోయారు. ప్రయాణికులు అర్ధరాత్రి 2 గంటల నుండి చిన్న పిల్లలతో నడి రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. మీడబ్బులు మీకు ఇస్తాము వెళ్ళండి అని నిర్లక్ష్యపు సుమాధానం ఎలిగన్స్ ట్రావెల్స్ యాజమాన్యం చెబుతుందని ప్రయాణికులు ఆరోపించారు. వారిలో ఓ మహిళ 11 గంటలకు ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఆమె ఆందోళన. దిక్కుతోచని స్థితిలో వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఘటనా స్థలానికి చేరుకున్న వీరవల్లి పోలీసులు, డ్రైవర్, క్లినర్ లను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *