గ్రామస్తుల ఆందోళన

సిరా న్యూస్,ఒంగోలు;
బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో వందల ఏళ్ళ క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్ర మట్టి కొండ అక్రమార్కుల చెరలో చిక్కుకొని చిక్కిపోతున్న పరిస్థితి నెలకొంది.కొంత మంది వ్యక్తులు అక్రమంగా కొండను తవ్వుకొని ఎర్రమట్టిని తరలిస్తుండగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు . కొండ వద్దకు వెళ్లి క్రేన్లు, లారీలును అడ్డుకున్నారు. ప్రతి ఏటా గ్రామంలో మూడు పంటలు పండేవని, కాని ఇప్పుడు కొండ త్రవ్వకాల కారణంగా దుమ్ము, ధూళి తో వాతావరణం కలుషితం కావడం వల్ల ఒక్క పంట కూడ సరిగా పడటం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం కూడా దొరకక పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిని పోయిందని వాపోతున్నారు . అనుమతులు లేకపోయినా గ్రామంలో కొండను తవ్వుకొని కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *