రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా బాల్కొండ శాసనసభ్యుడుమంత్రి ప్రశాంత్ రెడ్డి వేల్పూరు లో పత్రికా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు గత ఎన్నికల్లో హామీ మేరకు మొక్కజొన్న పంటకు సోయా పంటకు కనీస మద్దతు ధర కాకుండానే బోనస్ గా 500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులకు హామీ ఇచ్చిన మేరకు ఎకరాకు 7500 రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేశారు అర్హులైన ప్రతి రైతుకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు బాల్కొండ నియోజకవర్గం లో 48000 రైతులు రుణమాఫీకి అర్హులు కాగా కేవలం 16000 మందికే మాఫీ అయిందని ఇంకా 32000 రైతులకు మాఫీ కావాలని త్వరగా పూర్తి చేయాలని కోరారు అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం లో ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బ తిందని చాలా గ్రామాల్లో టైఫాయిడ్ చికన్ గున్యా లాంటి రోగాలు ప్రభలుతున్నాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే స్పందించి గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *