సిరా న్యూస్,రంగారెడ్డి;
రాచకొండ ఆదిభట్ల పోలీసు పరిధిలో ఒక మృతదేహం లభించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించార. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. మృతదేహం కాళ్ళు చేతులు కట్టేసి సంచిలో కట్టివేసి ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి కిందకు పడవేసారు.ఘటన జరిగి సి రెండు లేదా మూడు రోజులు అవ్వడం తో కుళ్ళిన వాసన రావడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు(పురుషుడు) 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లు గుర్తించారు.