సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్
గుర్తింపు కార్డు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు…!
హైదరాబాద్ ప్రతినిధి, ఉదయం
ప్రభుత్వ ఉత్తర్వల మేరకు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్లు ఆయిన జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి అక్రిడిటేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తున్నది. ఆ గడువు ఈ నెల జూన్ 30 తో ముగిస్తుండగా, గడువు తేదీని సెప్టేంబర్ 30 వరకు పొడిగించినట్లు ఆ ఉత్తర్వులలో తెలిపారు.