పరిశ్రమలు నెలకొల్పడంలో ఘోరంగా విఫలమైన వైసీపీ
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల పట్టణం నందు నిర్వహిస్తున్న డోర్ టు డోర్ క్యాంపియన్ లో భాగంగా ఈరోజు ఉదయం నూనపల్లె లోని నివర్తి నగర్ లో పర్యటించినట్లు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలియజేశారు.
*ఈ సందర్భంగా 29 వ వార్డు టీడీపీ ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు , మాజీ కౌన్సిలర్ వాకా శివశంకర్ యాదవ్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఇంటింటికి చంద్రబాబు అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నామన్నారు . ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వం వేస్తున్న పన్నుల గురించి చెప్తూ ఆవేదనకు గురవుతున్నారని , అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో చదువుకున్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వారికి ఉపాధి కల్పించడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని అన్నారు . టీడీపి చేపట్టిన ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి విశేష స్పందన రావడంతో ఈ వైసీపీని ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.