సిరా న్యూస్,విశాఖపట్నం;
మల్కాపురం ఏడుగుడులు ప్రాంతానికి చెందిన కిరణ్ పై గంగవరం కు చెందిన కోర్లయ్య కత్తి తో దాడి చేసాడు. ఇటీవలే అగనంపూడి ఆసుపత్రిలో కిరణ్ భార్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. భార్యను బిడ్డను చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో కోర్లయ్య బైక్ తో ఢీ కొట్టి దాడి అనంతరం కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తరువాత నిందితుడు దువ్వాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడు కోర్లయ్యకు కిరణ్ అత్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు అనుమానం. దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.