సిరా న్యూస్,చంద్రగిరి;
చంద్రగిరిలో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాజేష్ నాయక్ కుమార్తె సోనీ కుమారి (6) కనిపించకుండా పోయింది. తండ్రి రాజేష్ నాయక్ ఎం.కొంగరవారిపల్లి దగ్గర జగనన్నకాలనీలో సిమెంట్ బ్రిక్స్ బట్టీలో పని చేస్తున్నాడు. కూలీ పనులు కోసం జార్ఖండ్ నుంచి రాజేష్ నాయక్ కుటుంబం వలస వచ్చింది. గురువారం వరకు బాలిక ఆచూకీ లభించలేదు.ఓ వ్యక్తి పై అనుమానంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని విచారించి వదిలేయడంతో కుటుంబ సభ్యులుమండిపడుతున్నారు. రెండు రోజులుగా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు గాలిస్తున్నారు.రోజులు గడిచే కొద్దీ రాజేష్ నాయక్ కుటుంబం భయాందోళనలకు గురవుతోంది.