రైతాంగానికి ఇచ్చిన హామీలను, ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి

సిరా న్యూస్,బయ్యారం;
మహబూబాబాద్ లో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన మామిడాల బిక్షపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాలుకు 500రూపాయలతో పాటు అన్ని రకాల వ్యవసాయ పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తడం లేదని రైతు రుణమాఫీని అమలు చేయకుండా ఐదు సంవత్సరాల కాలం సాగదీసిందని, రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు దాని అమలుకు పూనుకోలేదని అన్నారు.దేశంలో కొనసాగుతున్న రైతువ్యతిరేక విధానాల వలన సేద్యం కుంటుపడే పరిస్థితి వచ్చిందని, వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి రైతాంగాన్ని ఆదుకోకపోతే దేశం ప్రమాదంలో పడుతుందని ఎన్నికలకు ముందు పాలక పార్టీలు వ్యవసాయ రంగానికి రైతాంగానికి, ఇచ్చిన హామీలను సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా నమ్మకద్రోహానికి పాల్పడటం ఆనవాయితీగా మారిందని ఆయన ఆరోపించారు.ప్రభుత్వాల సహాయసహకారాలు లేకుండా వ్యవసాయంముందుకు సాగదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత నిచ్చి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరారు. ఇప్పటికైనా రైతాంగానికి అప్పుల ఊబి నుంచి బయటపడడానికి రైతురుణ మాఫీ చట్టంచేయటంతోపాటు మద్దతు ధరను అందించడానికి పూనుకోవాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బోనస్సు రైతు రుణమాఫీ తో సహా ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని సమగ్ర వ్యవసాయ ప్రణాళికను రుణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
గత కొన్ని రోజులుగా సంస్థ విచ్చిన్నకర, నిర్మాణ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న సంఘం ప్రధాన కార్యదర్శి బి భాస్కర్, సహాయ కార్యదర్శి మొబిలి ప్రతాపరెడ్డిలు సమాచారం ఇచ్చినా సమావేశానికి రాకుండా తమ విచ్ఛిన్నకర కార్యకలాపాలను కొనసాగిస్తున్నందున వారిని సంఘం నుండి బహిష్కరిస్తూ సమావేశం తీర్మానించింది.
రాష్ట్ర ప్రభుత్వం తునికాకు సేకరణ ధరను పెంచకపోవడం వలన కూలీలకు అన్యాయం జరుగుతుందని. ఆకు సేకరణ సమయం దగ్గర పడుతున్నందున కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేసి అధిక ధరను సాధించుకోవడానికి తునికాకు సేకరణ కూలీలు ముందుకు రావాలని సమావేశం తీర్మానించింది.
సమగ్ర రుణప్రణాళికను రూపొందించి ప్రతిరైతుకు అవసరమైన పంటరుణాలను బ్యాంకుల అందించేందుకు పూనుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, యదల్లపల్లి సత్యం, సహాయ కార్యదర్శి గౌని ఐలయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు,బానోత్ ఊక్లా,బూర్క వెంకటయ్య, ఎం గిరి తదితరులు పాల్గొన్నారు
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *