సిరా న్యూస్,సింహాచలం;
పుష్య బహుళ అమావాస్య శుక్ర వారం సాయంసంధ్య వేళ సింహాద్రినాధుని తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవం లో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతసేవతో మేల్కొలిపారు. నిత్యారాధనలు నిర్వహించారు .అనంతరం సాయంత్రం మెట్లమార్గంలో కొండదిగువన వరహా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే సర్వాంగసుందరంగా అలంకరించి హంసవాహనంపై వేణుగోపాలస్వామి అలంకరణలో ఉన్న అప్పన్నస్వామిని ఉభయదేవేరులతో ఆశీనులను గావించి పుష్కరిణిలో గుడి చుట్టూ మూడు సార్లు మంగళవాయిద్యాల నడుమ, వేద మంత్రోచ్చరణల నడుమ విహరింపజేశారు. పుష్కరణి మద్యలో ఉన్న మండపంలో స్వామిని ఆశీనులను గావించి ప్రత్యేకపూజలు నిర్వహించారు . అనంతరం స్వామివారు తిరుగు వచ్చినప్పుడు భక్తుల హరినామస్మరణలతో పుష్కరిణి ప్రాంతం మారుమ్రోగింది . ఈ కార్యక్రమంలో సింహాచల దేవస్థానం ఈవో శ్రీనివాస్ మూర్తి మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు