సిరా న్యూస్,ఖమ్మం;
ఎంత అడిగినా చెవి దుద్దులు కొనివ్వడం లేదని ఆ మహా ఇల్లాలు ఏకంగా భర్తకు నిప్పంటించింది. కాలన గాయాలతో భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నిజాంపేటలో షేక్ యాకూబ్పాషా, సమీనా దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు బంగారు చెవి దుద్దులు కొనివ్వాలని సమీనా భర్తతో తరచూ పోరు పెట్టేది. ఈ విషయంపై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో తన వద్ద అంత డబ్బు లేదని, తర్వాత కొనిస్తానని పాషా చెప్పాడు. దీంతో కోపోధ్రిక్తురాలైన భార్య సమీనా ఇంట్లో ఉన్న పెయింట్లకు సంబంధించిన రసాయనాన్ని తెచ్చి పాషాపై పోసి నిప్పంటించింది. మంటలు తెలరేగి పాషా తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు సమీనాను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.