సిరా న్యూస్,విజయవాడ;
ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన శాంతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ భర్త కామెంట్స్ తొ రాజకీయ రంగు పులుముకుంది.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి, దేవాదాయ శాఖ ఉద్యోగికి అక్రమ సంబంధం అంటగడుతూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అధికారి మాజీ భర్త నుంచి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న విజయసాయి రెడ్డికి ఇది ఓ సవాల్ గా మారింది. ఈ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని అతడు వెల్లడించాడు. తన భార్య గర్భానికి విజయసాయిరెడ్డి కారణమని తీవ్ర ఆరోపణ చేశాడు. తాను విదేశాల్లో ఉండగా ఇండియాలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని ఫిర్యాదులో మదన్ మోహన్ పేర్కొన్నాడు. అయితే తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ కోరుతూ మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్కు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి వ్యవహరించింది. ఆమెకు ఆ పోస్ట్ విజయసాయి రెడ్డే ఇప్పించారని అంటుంటారు. విశాఖ పర్యటనలో విజయసాయి రెడ్డి ఉంటే.. ఆమె వెంట శాంతి కూడా కనిపించేవారు. మరోవైపు వైసీపీ పెద్దలకు నమ్మకంగా ఉంటూ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణులు శాంతిపై ఉన్నాయి. అత్యంత వివాదాస్పద అధికారిగా శాంతికి పేరుంది. దీంతో కొత్త ప్రభుత్వం రాగానే దేవదాయ శాఖ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు శాంతి భర్త స్వయంగా ఆమెపై దేవదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం, అందులో విజయసాయి రెడ్డి పేరు పెట్టడం పెను సంచలనం రేపుతోంది.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వ్యవహారంపై చర్చ జరుగుతోంది. దీంతో, శాంతి మీడియా ముందుకు వచ్చారు. 2013లో తనకు మదన్ మోహన్ తో వివాహం జరిగిందని ఆమె వెల్లడించారు. లా చదువుతుండగానే తమ ఇద్దరికీ పెళ్లయిందని వివరించారు. కానీ పెళ్లయ్యాక మదన్ మోహన్ తనను చాలా హింసించాడని శాంతి ఆరోపించారు. దాంతో 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. పిల్లలు, బంగారం, కారు విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కూడా రాసుకున్నామని తెలిపారు. మదన్ మోహన్ తో విడాకుల తర్వాత తాను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లాడానని శాంతి వెల్లడించారు. 2021 వరకు తాను విశాఖలోనే ఉండేదాన్నని పేర్కొన్నారు. తాను మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ, మదన్ తనను వేధిస్తుండేవాడని ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చాక పిల్లలను మదన్ కు చూపించానని తెలిపారు. డబ్బు కోసమే అతడు ఇలాంటి అనుమానాలు సృష్టించేలా ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు. తాను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇంతమంది తనను టార్గెట్ చేశారని శాంతి వెల్లడించింది. అదే వేరే కులానికి చెందిన దాన్నయితే ఇలా అనగలరా? ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా? మంచి బట్టలు వేసుకోకూడదా? నగలు ధరించకూడదా? కష్టపడి న్యాయవాద విద్యను చదివాను, అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేశాను. ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం లేదంది శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సాయిరెడ్డి సార్ గురించి చెప్పాల్సి వస్తే… ఆయనొక గౌరవనీయ వ్యక్తి. విజయసాయిరెడ్డి సార్ ను మొదటిసారి విశాఖలోనే చూశానని క్లారిటీ ఇచ్చింది. తనది నంద్యాల అని… చెబుతున్న శాంతి. రాయలసీమలో తనకు ఒక్క సర్పంచి కూడా తెలియదని వెల్లడించింది శాంతి. దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనే సంస్థ ఉంది. దీని వ్యవహారాలు చూసుకోవాల్సింది అసిస్టెంట్ కమిషనర్. ఆ ప్రేమ సమాజం సంస్థకు విశాఖ బీచ్ రోడ్ లో 30 ఎకరాల భూమి ఉందని… అందులో ఉన్న సాయి ప్రియా రిసార్ట్స్ వాళ్లు ఆ 30 ఎకరాల భూమికి చాలా తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు. సాయిరెడ్డి సార్ ద్వారా ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దాంతో తాను ఆ స్థలంలో ఇన్ స్పెక్షన్ కు వెళ్లానని. అక్కడి నిర్వాహకులతో మాట్లాడానని శాంతి చెప్పింది. లీజును పెంచడం ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసే ప్రయత్నం చేశాను. ఇదీ… సార్ తో తనకున్న పరిచయం” అంటూ శాంతి కన్నీటిపర్యంతమయ్యారు. మహిళాఅధికారితో సంబంధం ఉందంటూ తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని.. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్లాన్ ప్రకారమే తనపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టను దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా.. ఐదేళ్లకు ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయమన్నారుఓ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతయుతమైన ఎంపీగా తాను పని చేస్తుంటే ఓ ఆదివాసీ మహిళతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు విజయసాయిరెడ్డి. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన మీడియా సంస్థలను వదిలేది లేదన్నారు. యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. తనపై కుట్ర చేస్తున్న వాళ్లందరికీ బుద్ధి చెబుతాను అన్నారు. తనపై ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తా అని తెలిపారు. విధి నిర్వహణలో తనను చాలా మంది ప్రజలు, ఆఫీసర్లు కలుస్తారని కలిసినంత మాత్రాన సంబంధం అంటగడతారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అటు మదన్ మోహన్ కామెంట్స్… ఇటు శాంతితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్లతో సమస్యకు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.