సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీలు రాంభూపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్న వీరికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, అధికార పార్టీ వాళ్లకే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ సామాన్య భక్తులకు దర్శనం దూరం చేయడం జరుగుతోందని మండిపడ్డారు…
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఈనెల 5వ తేదీ నుండి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలో బహిరంగ సభలు నిర్వహిస్తూ, రాష్ట్ర అరాచక పాలన పై ప్రజలకు వివరించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించే దిశగా తమ అధినేత చంద్రబాబు నాయుడుకి శ్రీవారు మనోధైర్యం కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు…