రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ల రాంబాబు
సిరా న్యూస్,జగిత్యాల;
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం పెదవాడిని దోచి సంపన్నులకు కట్టబెట్టి కార్పొరేట్ దారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలంగాణా భవన నిర్మాణ కార్మిక సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ల రాంబాబు విమర్శించారు.
దేశవ్యాప్త పిలుపులో భాగంగా భవనిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాజేశ్వరమ్మ కు తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
భవనిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన మీదటనే ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు అడగాలని లేనిపక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్తామని రాంబాబు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కిరణ్ శ్రీ గాధ దేవదాస్ ఎండి ఉస్మాన్ వెన్న మహేష్ అందే వంశీ, శ్రీనివాస్, గుడిపల్లి ఏడుకొండలు ,చిన్నయ్య ధర్మయ్య ఎండి ఆఫీజ్ ,నాయక్ వెన్న మనితేజ తదితరులు పాల్గొన్నారు.