ముగ్గురు అరెస్టు
సిరా న్యూస్,పెద్దపల్లి;
తీసుకున్న అప్పు తీర్చలేక ఒంటరిగా ఉన్న ఓ మహిళను హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్ మాట్లాడుతూ…. ఈనెల 8న ముత్తారం మండలం పారుపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ మహిళ మృతదేహం లభ్యం అయిందని , దానిపై లోతైన విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ముత్తారం మండల కేంద్రంలోని కాసర్లగడ్డ కు చెందిన రజిత అనే మహిళ అదే గ్రామానికి చెందిన పెరుక రాజేశ్వరి దగ్గర లక్షా యాభై వేల రూపాయలుఅప్పుగా తీసుకుంది. గత కొంతకాలంగా రాజేశ్వరి తన డబ్బులు తనకు ఇవ్వమని రజిత పై ఒత్తిడి తీసుకువచ్చింది.
దీంతో రజిత ఆమె భర్త తో పాటు వీరి దగ్గర జెసిబి డ్రైవర్ గా పనిచేస్తున్న మరో వ్యక్తి ముగ్గురు కలిపి పథకం ప్రకారం రాజేశ్వరిని హత్య చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని రాజేశ్వరిని ఈనెల 5వ తేదీన రజిత తన ఇంటికి పిలిచి రాజేశ్వరి గొంతు నులిమి హత్య చేసి గోనెసంచిలో మూటకట్టి సాయంత్రం అయ్యాక పారుపల్లి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడవేశారు. ఈనెల 8వ తేదీన పారుపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో లభ్యమైన గుర్తుతెలియని మహిళా మృతదేహం పైన పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు రాజేశ్వరిని హత్య చేసిన అనంతరం రాజేశ్వరి ఒంటిపై ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు సైతం తీసుకొని అమ్ముకున్నట్లు పోలీసులు వెల్లడించారు.