ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థిగా ధాట్ల సుబ్బరాజు పేరు ఖరారు

సిరాన్యూస్,ముమ్మడివరం;
ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థిగా ధాట్ల సుబ్బరాజు పేరునుటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించడంతో మురమళ్ళ టీడీపీ కార్యాలయం వద్ద ఆనందోత్సాహంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మొదటి విడతలో దాట్ల సుబ్బరాజు కి సీటు ప్రకటించడం పట్ల టీడీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ పొత్తులో భాగంగా టిడిపి అభ్యర్థిగా నాకు సీటు కేటాయించడంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గ నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని పనిచేసి టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం అని అన్నారు. నన్ను నమ్మి నాకు మూడవ సారి టిక్కెట్ కేటాయించిన అధినేతకు నా విజయాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *