సిరా న్యూస్,పరవాడ;
విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎవ్వరూ అనే సందేహాలకు ఫులస్టాప్గా పంచకర్ల పేరు ప్రకటనతో ఆగినట్టు అయ్యింది. రాష్ట్రములో ఎన్నికల కోడ్ వచ్చి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పెందుర్తి టీడీపీ కూటమి అభ్యర్థి పేరు ఎవ్వరిది ప్రకటించకపోవడంతో ఇటు టీడీపీ నుంచి బండారు వర్గం అటు జనసేన నుంచి పంచకర్ల వర్గం ఎవ్వరికి వారు తమ నాయుకుడికి ఎమ్మెల్యే టికెట్ ఖాయం అంటూ ప్రచారం చేసుకొంటూ వచ్చారు అయ్యితే ఆదివారం జనసేన పార్టీ అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటనలో పంచకర్ల రమేష్ బాబు పేరు ఉండడం అందరి సందేహాలకు జవాబు దొరికినట్టు అయ్యింది. జనసేన పార్టీ అనకాపల్లి రూరల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న పంచకర్ల పెందుర్తి టికెట్ పై తనకు ఉన్న నమ్మకం మీద ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను,నాయకులలో తన పై నమ్మకం పెంచుకొంటున్నారు. కూటమి అభ్యర్థిగా పొత్తు ధర్మం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం తనును గెలిపించాలని ప్రచారం చేసుకొంటూ నియోజకవర్గంలో టీడీపీ,బిజెపి కూటమి నాయకులను కలుపుకోనిపోయే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారు.