రాజాం లో ఐపీఎల్ క్రికెటర్ల సందడి…

సిరా న్యూస్,శ్రీకాకుళం;
ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో జిఎంఆర్ ఐటి క్యాంపస్ ను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఢిల్లీ క్యాపిటల్స్ డైరక్టర్ సౌరభ్ గంగూలి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చాలా చురుకుగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జిఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు అభినందించారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన జిఎంఆర్ ఐటి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహుమతులు క్రీడాకారులు అందజేశారు. ఐపిఎల్ ఢిల్లీ క్యాపిటల్ క్రికెటర్లను చూడటానికి విద్యార్థులు యువత ఎంతో ఉత్సాహాన్ని చూపారు…
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *