శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉదృతి డ్యామ్ రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేత

సిరా న్యూస్,కర్నూలు;
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది.ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుండి 2,55,215 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీనితో జలాశయం నీటిమట్టం నీటి సామర్థ్యం పూర్తిస్థాయికి చేరుకోవడంతో ఈ సంవత్సరంలో రెండవసారి జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.అయితే జలాశయానికి ఇన్ ఫ్లోగా 2,13,624 క్యూసెక్కులు రాగా జలాశయం రెండు రేడియల్ క్రెస్టు గేట్లు నుండి అలానే కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్ కి జలాశయం నుండి మొత్తం ఔట్ ఫ్లోగా 1,22,876 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో 885 అడుగులు చేరింది.మరోపక్క జలాశయం నీటి నిల్వ కూడా 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో 215.8070 టీఎంసీలుగా చేరింది. జలాశయం వరద ఉధృతి ఇలాగే పెరిగితే మధ్యాహ్నం లేదా సాయంత్రానికి మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లుగా అధికారుల ద్వారా సమాచారం తెలుస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *