సిరా న్యూస్,విజయవాడ
వైకాపాలో ఇన్ ఛార్జుల మార్పు ప్రక్రిక కొనసాగుతోంది. మరికొన్ని స్థానాల్లో ఇన్ఛార్జ్ల మార్పునకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 72 మందిని మార్చింది వైసీపీ అధిష్ఠానం. 1 59 ఎమ్మెల్యే, 13 ఎంపీస్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు. మూడు ఎంపీ స్థానాల్లో పాతవారినే కొనసాగించే అవకాశం వున్నట్లు సమాచారం. త్వరలో మిగిలిన 9 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన వెలువడనుంది. కొత్త ఇన్ఛార్జ్లను కూడా మార్చే అవకాశం వుంది. ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు మార్పులుంటాయని అధిష్ఠానం స్పష్టం చేసింది.