కేసీఆర్ తోనే వుంటాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సిరా న్యూస్,హైదరాబాద్;
ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ హామీల పై కాంగ్రెస్ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తోంది. చాలా అంశాల్లో ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు.
.ఈ ప్రెస్ మీట్ వేదిక నుంచే మెదక్ పార్లమెంట్ సమీక్ష ముగిశాక ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించా. మహాలక్ష్మి, యువ వికాసం గ్యారంటీలు ఎప్పట్నించి అమలు చేస్తున్నారో చెప్పాలి. నా నియోజక వర్గం లో ప్రొటో కాల్ వివాదాల పై ఆ రోజే చెప్పా. ఇదే అంశం పై ఐజీ శివధర్ రెడ్డి ని సీఎం రేవంత్ రెడ్డి ని కలిశామ్. మేము పార్టీ మారే ప్రసక్తి లేదు. ప్రజలలో కొందరు గందర గోళం సృష్టిస్తున్నారు. అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా అధిష్టానానికి మా మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. కేసీఆర్ వెంటే ఉంటాం. మెదక్ గులాబీ జెండాకు పుట్టినిల్లని అన్నారు.
కేసీఆర్ సారధ్యం లో మెదక్ పార్లమెంటు నియోజక వర్గాన్ని గెలుచుకుంటాం. మా మీద దుష్ప్రచారం కొనసాగిస్తే పరువు నష్టం దావాలకు వెనుకాడం. మాకు రాజకీయ విలువలు ఉన్నాయి. ప్రోటోకాల్ ఉల్లంఘనల పై ప్రభుత్వం తో పోరాడుతూనే ఉంటాం. ప్రతిపక్ష స్థానాన్ని బలంగా పోషిస్తాం. అపనిందలు మోయాల్సి రావడం బాధాకరం. సమస్యల పరిష్కారం కోసం సీఎం ను కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం సమస్యల పై సీఎం రేవంత్ ను కలిశాము. సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు కదా . సీఎం ను కలిసినంత మాత్రాన మేమేదో పార్టీ మారుతున్నట్టు దుష్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఓ ఎండ్రికాయల పార్టీ. అందులో ఎవరు చేరుతారు ? మెదక్ ఉద్యమాల గడ్డ ..ఉద్యమం లో కేసీఆర్ తో ఉన్నాం .ఇక ముందు కూడా ఉంటామని అన్నారు.
కాంగ్రెస్ వాళ్ళే ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ప్రధానిని కూడా కలిశాను బీజేపీ లో చేరుతున్నట్టా .మంత్రులను కూడా సమస్యల పై కలుస్తున్నా. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు పై ప్రభుత్వం దృష్టి సారించాలి. మెదక్ పార్లమెంటు పై ఎగిరేది గులాబీ జెండా. నేను రాజకేయాల్లో ఉన్నన్నీ రోజులు బీ ఆర్ ఎస్ లోనే ఉంటాను. ప్రజల కోసం పోరాడే పార్టీ బీ ఆర్ ఎస్. దుష్ప్రచారాన్ని సహించేది లేదు .ఎండగడుతామని అన్నారు.కోమటి రెడ్డి రైతు బంధు రాదనే వారిని చెప్పుతో కొట్టాలి అంటున్నారు. ఇదేనా సంస్కారం. ముందు రైతుబంధు సాయం వేయండి ,రైతు రుణ మాఫీ చేయండి. ఎన్నికల కోడ్ రాకముందే హామీలు నెరవేర్చండి. మా మీద అధిష్టానానికి నమ్మకం ఉంది. బీ ఆర్ ఎస్ ను బొంద పెడతా అన్న రేవంత్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞత కే వదిలేస్తున్నానని అన్నారు.
.బీ ఆర్ ఎస్ ను బొంద పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. నా నియోజక వర్గం లో ఈ రోజు మంత్రి పర్యటిస్తుంటే నాకు సమాచారం లేదు. ప్రొటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. నాకు అదనపు భద్రత కూడా రావాలని అన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సమస్యల పై ఎస్పీ ని కలెక్టర్ ఇదివరకే కలిశాము. వాటికి కొనసాగింపుగానే శివధర్ రెడ్డి ని సీఎం రేవంత్ ను కలిశాం. నేను బతికున్నంత కాలం బీ ఆర్ ఎస్ ను వీడను. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు ఖండిస్తున్నా. రేవంత్ మోడీ ని కలిస్తే బీజేపీ లో చేరినట్టా
..కేసీఆర్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ..ఆయన్ను వీడను. కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. అభివృద్ధి ,సంక్షేమం కేసీఆర్ హయం లో జోడెడ్ల లా సాగింది. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మా రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు