లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి బలి

సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండల కేంద్రం ఎస్.రాయవరం లో ఓ వ్యక్తి ని ఆన్ లైన్ లోన్ యాప్ బలి తీసుకుంది. లోన్ యాప్ ద్వారా తీసుకున్న సొమ్మును తక్షణమే కట్టాలంటూ ఎగ్జిక్యూటివ్ లు వేధింపులు తాళలేక ఉల్లి మణికంఠ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్.రాయవరం మండలం, ధర్మవరం జాతయరహదారి వద్ద నున్న వరహ బ్రిడ్జి పై నుండి నదిలోకి దూకి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ .రాయవరం పోలీసులు వరహ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్ ల వేధింపుల కారణంగా మనస్తాపానికి గురై నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యుల తమ కుమారుడి కోసం నది వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *