చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ సిబ్బంది.

విలువైన వస్తువులు రికవరీ

కొత్త చట్టాలద్వారా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని వెల్లడి

సిరా న్యూస్,మెట్ పల్లి;
మెట్ పల్లి పట్టణంలోని ప్రియదర్శిని కాలనీ లో జరిగిన చోరీ కేసును చాకచక్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ లు ఛేదించి దొంగలను పట్టుకున్నామని బుధవారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో వివరించారు. పోలీస్ వారి కథనం ప్రకారం జులై 12ణ మధ్యాహ్నం ప్రియదర్శిని కాలనీ, మెట్‌పల్లిలో గుర్తు తెలియని నిందితులు ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తెరిచి బంగారు ఆభరణాలు చోరి చేసారని, మెట్ పల్లి డిఎస్పీ ఉమా మహేశ్వర రావు సూచనల మేరకు మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలిస్తు ఉండగా 24వ తేదీ బుధవారం మెట్ పల్లి పాత బస్ స్టాండ్ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా నిందితులు శ్రీరామ్ శివసాగర్ మరియు కట్ట మల్లేష్ బీడీ వర్కర్స్ కాలనీ, మెట్‌పల్లికి చెందినవారిని అదుపులో కి తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా, నిందితుడు శ్రీరామ్ శివసాగర్ గతంలో 2023 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం శివార్లలో బాధిత మహిళను కత్తితో బెదిరించి మేడలోని బంగారు పుస్తెల తాడు దోచుకున్నాడని వివరించారు. నిందితుల వద్ద నుండి ఒక జత ఇయర్ రింగ్స్ మరియు సాకేట్ గుండ్లు,ఒక బంగారు గొలుసు మరియు “R” చిహ్నాన్ని కలిగి ఉన్న లాకెట్,వెండి పట్టా గొలుసులు, బంగారు నల్ల పూసల తాడు,గోల్డ్ ఇయర్ రింగ్స్ మొత్తం 52.1 గ్రాముల బంగారం మరియు 55 గ్రాముల వెండి విలువ మూడు లక్షల డెబ్భైవేలు రూపాయలు మరియు ఎక్టివ స్కూటీ, ఒక మొబైల్ విలువ ముప్పైవేలు, మొత్తం సుమారు నాలుగు లక్షల విలువగల వస్తువులను స్వాధీన పరుచుకున్నారని మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మరియు రోడ్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా నేరస్తుల వివరాలు క్లుప్తంగా బయటపడతాయని తెలిపారు. జులై 1 వ తేదీ నుండి కొత్త చట్టాలు అమలులో ఉన్నాయని, కొత్త చట్టాల ద్వారా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకొనబడతాయని, శిక్షలు కూడా కఠినంగా ఉంటాయాన్ని హెచ్చరించారు.గత సంవత్సరం ఇబ్రహీంపట్నంలో జరిగిన దొంగతనంలో మరియు ఈ నెల మెట్ పల్లి లొ జరిగిన దొంగతనంలో పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పట్టుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఇట్టి దొంగలను చాక చక్యంగా వల పన్ని సమాచారం సేకరించిన సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి మరియు పీసీలు కిరణ్, సంతోష్ లను ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డితో పాటు, ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *