కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలి

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

 సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓ పి ఎం ఎస్ ప్రకారం తక్షణమే కేటాయించిన మిల్లలకు రవాణా చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లను ఆదేశించారు. సోమవారం కొత్తపకల్లి, చిట్యాల కొనుగొలు కేంద్రాల్లో ధాన్యం
కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తెచ్చునపుడు నిబంధనల ప్రకారం నాణ్యత పాటించాలని అన్నారు. అకాల వర్షాలు సంబవించే అవకాశం ఉన్నందున ధాన్యం తడవ కుండా టార్ఫాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. అనంతరం
కైలాపూర్‌ రైస్‌ మిల్లును, సీఎంఆర్‌ డెలివరీని ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం
దిగుమతిలో జాప్యం జరుగకుండా ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని మిల్లర్లును ఆదేశించారు. సి ఎం ఆర్ మిల్లింగ్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకుని నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *