అసలైన ప్రజానాయకుడు వైఎస్సార్

రాహుల్ గాంధీ

సిరా న్యూస్;
అసలైన ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్సార్. అయన మరణం అత్యంత విషాదం. అయన బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేది. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు. కష్టాలు,కన్నీళ్లు ఉండేవి కావని అన్నారు.
వైఎస్సార్ వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకు వెళ్తుంది. నాకు ఆ నమ్మకం బలంగా ఉంది. షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుంది. వైఎస్సార్ లో ఉన్న ధైర్యం,సిద్ధాంతాలు,న్యాయకత్వ లక్షణాలు షర్మిల లో చూశా. నేను వ్యక్తిగతంగా వైఎస్సార్ నుంచి ఎంతో నేర్చుకున్న. వేఎస్సార్ పాదయాత్ర నా జోడో యాత్రకు స్ఫూర్తి. నాడు వైఎస్సార్ ఎండను,వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ఆయనే నాకు స్ఫూర్తని అన్నారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *