కొమురవెళ్లి హుండి లెక్కింపులో ఉంగరం మాయం

 సిరా న్యూస్,సిద్దిపేట;
కొమురవెళ్లి ఆలయ హుండీ లెక్కింపులో మాయమైన ఉంగరం ఘటన మలుపులు తిరుగుతోంది.ఏఈవో గంగ శ్రీనివాస్ పై ఆలయ ఈవో బాలాజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఏఈవో పై ఈవో కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
బుధవారం ఆలయ హుండీ లెక్కింపు చేస్తుండగా హుండీలో భక్తులు వేసిన బంగారు చైన్, ఉంగరం కనిపించాయి. వాటిని టేబుల్ పై పెట్టి ఏఈవో కి సమాచారమిచ్చి లంచ్ కి వెళ్లానని ఈవో చెబుతున్నారు. తిరిగి వచ్చిచూసేసరికి టేబుల్ పైన కాకుండా చెత్తకుప్పలో చైన్ పడివుంది.ఉంగరం మాయమైంది. ఘటన సమయంలో సిసి కెమెరా పని చేయలేదు. మిగతా అన్ని సిసి కెమెరాలు పని చేసి ఉంగరం ఉన్న టేబుల్ వద్ద సీసీ కెమెరా పని చేయకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *