పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్

 సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ పట్లూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసారు. సమయానికి ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో మండిపడ్డారు. జిల్లా అదికారి డిఎండ్ఎచ్ ఒ పాల్వకుమార్ పోన్ తీయకపోవడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో సారి ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకోవాలని తెలిపారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *