బీజేపీ, బి ఆర్ ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వవిప్ అది శ్రీనివాస్ ఫైర్

సిరా న్యూస్,హైదరాబాద్:
ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ బీజేపీ,బీఆర్ఎస్ లపైవిరుచుకపడ్డారు. తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని అయన ఫైర్ అయ్యారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే హరీష్ రావును అడ్డంపెట్టుకొని భ్రష్టు రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహస్య ఒప్పందాలకు నెమ్మదిగా తెర దించుతున్నాయన్నారు.. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరిపారు. హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఆయనతో రాజీనామా చేయించి బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సిద్దిపేటలో హరీష్ రావు మళ్లీ గెలుస్తాడని బండి సంజయ్ అంటున్నారు. హరీష్రావు పై వచ్చిన పొగడ్తలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్ధిస్తారా..? ఆ నేతల వ్యాఖ్యలను వరుసగా పరిశీలిస్తే మెదక్ లో బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కైయ్యాయని స్పష్టంగా అర్ధమవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *