ట్రాక్టర్ బోల్తా పడి యజమాని దుర్మరణం

సిరా న్యూస్,మదనపల్లె;
నిమ్మనపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడి యజమాని దుర్మరణం పాలైన విషాదకర సంఘటన శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. ఘటనపై నిమ్మనపల్లి ఎస్సై లోకేష్ రెడ్డి కథనం మేరకు.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం, పొదలపల్లెకు చెందిన వెంకట ముని (45) వాల్మీకిపురం లో ఉన్న తన అత్తగారికి పాడి ఆవుల కోసం వరిగడ్డి లోడు వేసుకుని రాత్రి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని, వాల్మీకి పురానికి వచ్చాడు. గడ్డి అన్లోడ్ చేసి వేకుజామున తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్లో వెంకట ముని బయలుదేరాడు. ట్రాక్టర్ మార్గమధ్యంలోని నిమ్మనపల్లి మండలం చింతపర్తి వారిపల్లె వద్ద ఉన్న ప్రభుత్వ స్కూల్ మలుపు వద్ద ట్రాక్టర్ వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కిందపడి వెంకట ముని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటన సమాచారం అందుకున్న నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *