కొడాలి నాని కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న బాధితులు

సిరా న్యూస్,గుడివాడ;
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రెండు జెసిబి లతో కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను తొలగించారు. కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
బాధితులు మాట్లాడుతూ బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశాడు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి. వేధించడమే కాకుండా తమపై దాడి చేయించాడు. న్యాయం కోసం పోలీసులను వేడుకున్నాం కోర్టులను ఆశ్రయించాం.. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాం. అయినా మాకు న్యాయం దక్కలేదు… వెనిగండ్ల రాము వల్లే నేడు మాకు న్యాయం జరిగింది. అందరినీ 420 అనే కొడాలి నాని నే అసలైన 420 . కొడాలి నాని నీ గుడివాడ నుండి తరిమి కొడతాం . మరలా కొడాలి నానిని రాజకీయాల్లోకి రాకుండా చేస్తాం. ఆశలు వదిలేసుకున్న తరుణంలో మా పాలిట దైవంలా వెనుగండ్ల రాము అండగా నిలబడ్డారు. ఇటువంటి మంచి వ్యక్తులు గుడివాడకు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాం. రాము ఎమ్మెల్యే గా ఉన్నంతకాలం గుడివాడకు అంత మంచే జరుగుతుందని బాధితులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *