అదీప్ రాజ్ గెలిపుకి కలిసికట్టుగా పని చెయ్యండి
– మండల సమావేశంలో ఉత్తరాంధ్ర వైకాపా ఇంచార్జ్,రాజ్య సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి
సిరా న్యూస్,పరవాడ;
పరవాడ గ్రామం స్థానిక యేకోనో హోటల్ లో పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పి.ఎస్ రాజు ఆధ్వర్యంలో పరవాడ మండల ప్రజా ప్రతినిధులు తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ సభ్యులు పెద్దలు వై.వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన సందర్భంగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు,జడ్పిటిసి పైల సన్యాసి రాజు గజమాలతో వైవి సుబ్బారెడ్డిని సాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దలు వై.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రేపు మే నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పార్టీ విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదిప్ రాజ్ విజయాన్ని ఎవరు ఆపలేరని, ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని , సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో అదిప్ రాజ్ నాయకత్వంలో పెందుర్తి వైఎస్ఆర్సిపి విజయం సాధించడం తద్యమని తద్వారా ఆ విజయం అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గెలుపునకు దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భయంతోనే అన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని అని అన్నారు., అధికారంలోకి రాలేనన్ను నమ్మకంతోనే అమలుకాని నెరవేర్చని హామీలను ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసగిస్తున్నాడని ఆరోపించారు. నీతివంతమైన పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు., పార్టీకి పట్టుకొమ్మలు మూల స్తంభాలు బూతు లెవెల్ లో ఉన్న భూత్ ఏజెంట్లు అధ్యక్షులు, కార్యకర్తలేనని అని అన్నారు. పార్టీ మనకు ఏమిచ్చిందని కాకుండా పార్టీకి మనము ఏమి ఇచ్చాం అనే విధంగా ఆలోచించే వ్యక్తిత్వం వున్నవారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులని అనిఅన్నారు.
ఈ ఎన్నికలు నీతికి అవినీతికి జరుగుతున్న యుద్ధం అని అభిప్రాయపడ్డారు. పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల కష్టాలను తీర్చడానికి అహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్
గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని స్పష్టం చేశారు.మనస్పర్థలు వివాదాలకు పోకుండా అందరం కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదేనని అయిన సూచించారు. కార్యకర్తలు నాయకులు మధ్య ఐక్యతఉండాలని అయిన తెలియచేసారు. మే 13 న జరగబోయే ఎన్నికల్లో ఎం.పి, ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ పరిశీలికలు తిప్పల గురుమూర్తి రెడ్డి , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైలపూడి భగవాన్ జై రాం, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు, ఎంఎస్ఎంఈ రాష్ర్ట డైరెక్టర్ నదియా, పరవాడ మండల వైస్ ఎంపీపీ లు బంధం నాగేష్, బూస రాజు, గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
==============================