సిరా న్యూస్,సిద్దిపేట;
జగదేవపూర్ లో నిన్న జరిగిన చికెన్ సెంటర్ ఓనర్ మహిపాల్ రెడ్డి (42) హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చికెన్ సెంటర్ లో పని చేసే వ్యక్తులే హత్య చేసినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఓనర్ ని షాపు లోపలికి పిలిచి డబ్బుల కోసమే హత్య చేసినట్టు పోలీసుల అనుమానం. హత్య చేసిన తర్వాత నిందితులు సీసీ కెమెరాల ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.