పోలీసుల జోక్యం
సిరా న్యూస్,హిందూపురం;
హిందూపురం పట్టణంలో మునిసిపల్ కార్మికులకు అధికారులకు మధ్య గొడవ చోటు చేసుకుంది. మున్సిపల్ కార్మికుల సమ్మెతో హిందూపురం పట్టణంలో రోడ్లపై చెత్త పేరుకుపోయింది. దింతో పర్మినెంట్ వర్కర్స్ తో క్లీన్చేయించేందుకు మున్సిపల్ అధికారులు అంబేద్కర్ సర్కిల్ వద్దకు పోలీసుల సహకారంతో చేరుకున్నారు. అయితే వీరిని ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు.శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉండటంతో పట్టణంలో పలుచోట్ల రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయింది. వీటిని క్లీన్ చేయించేందుకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ పర్మినెంట్ వర్కర్లతో , సచివాలయం సిబ్బందితో పాటు పోలీసుల సహకారంతో అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మెలో ఉన్న కార్మికులు భారీగా అడ్డుకొనేందుకు అక్కడికి చేరుకునినినాదాలు చేయడం మొదలుపెట్టారు. తమ కడుపు కొట్టొద్దు అంటూ కార్మికులు మున్సిపల్ కమిషనర్ని వేడుకున్నారు. ఏఐటియుసి నాయకులు మున్సిపల్ కమిషనర్ తో వాదనకు దిగారు. ఎటువంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.