ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ముమ్మరం చేసిన వైసిపి నేతలు

సంక్షేమ పథకాలే వైసిపిని గెలిపిస్తాయి —-
మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద చారి

– సిరా న్యూస్,కౌతాళం;
జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికల్లో వైసిపిని గెలిపిస్తాయని వైసిపి మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద చారి పేర్కొన్నారు. సోమ వారం కౌతాళంలో బయటి గేరీ మారెమ్మ, తలారి కలని, రెడ్డీస్ కలని ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించామని, పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలో రైతుల కోసం ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వై.బాలనాగి రెడ్డి కృషి చేశారని తెలిపారు. మంత్రాలయం ఎమ్మెల్యేగా వై.బాల నాగిరెడ్డిని, కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై.రామయ్యను గెలిపించాలని కోరారు. వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, సర్పంచి పాల్ దినకరన్, అవతారం, చౌదరి బసవరాజ్, తిక్కయ్యా , బిమేశ్,వడ్డే రాముడు, భీమేష్, వెంకోబా, అబ్దుల్ సమద్, హుసేని, రామకృష్ణ వేంకట రామ రాజు, నరసింహా, హాలీల్, భాష, జిలాన్ ,పాల్గొన్నారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *