సిరా న్యూస్,వరంగల్;
పోట్టకూటి కోసం బతకడానికి వచ్చిన కుటుంబానికి చెందిన అభం శుభం తెలియని ఓ పాప మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి సర్కస్ చేసుకొని బతకడానికి కొన్ని కుటుంబాలు వచ్చాయి. వచ్చిన వారిలో ఓ పాపను గుర్తుతెలియని ఓ యువకుడు బైక్ పైకి ఎక్కించుకున్నాడు. పాపకు చాక్లెట్ కొనిస్తానని బైక్ పై ఎక్కించుకున్నాడు. తతరువాత పాప భయభ్రాంతులకు గురై ఒకేసారి గట్టిగా అరవడంతో పాపను కెనాల్ కాల్వలో పడేశాడు. ఘటనలో పాప మృతిచెందగా ఆ మృతదేహం రెడ్లవాడ కెనాల్ కాల్వలో తేలింది. అది చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. అక్కడికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ పాప మృతదేహం ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామ శివారులో గల ఎస్ఆర్ఎస్పీ SP కెనాల్ లో కొట్టుకుపోతుండగా స్థానికులు బయటకు తీసినట్లు సమాచారం.