మంత్రి కోమటిరెడ్డి
సిరా న్యూస్,నల్గోండ;
మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మీకెందుకంటూ.. మాజీ మంత్రి హరీష్ రావు, బిజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.అన్నారు. కాంగ్రెస్ లో గ్రూపులు లేవు.. ఏక్ నాథ్ షిండేకలు లేరు.. ఇంకో పదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి ఉంటారని ఆయన జోస్యం చెబుతున్నారు. బిజేపీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టపెట్టి.. లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. దేశాయిక్యతకు జరగబోయే పార్లమెంటు ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తాయని అన్నారు. రంజాన్ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ఈద్గాలో సీనియర్ నేత జానారెడ్డి, ఆయన తనయుడు నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు..
=============