మంత్రి దామోదర రాజనరసింహ
సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలనపై అవగాహన కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ వ్యవస్థలో తప్పులు జరిగాయి..వాటిని సరిదిద్దుదాం. కొత్త ప్రభుత్వం ,కొత్త ఆశలు, కొత్త నడవడికలో బాధ్యతగా పనిచేస్తుంది. ఎవరిని విమర్శించే వ్యక్తిత్వం నాది కాదు.
ప్రజలు అసహనానికి గురి కాకుండ చూసుకునే బాధ్యత అధికారులదే. అధికారులు , నాయకులు పరస్పర సహకారంతో ముందుకు సాగి లబ్ధిదారులకు ప్రయోజనాలను అందిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి వుండదు, మానవతా కోణం వుంటుంది. అధికారులు నిబద్ధతతో పని చేయండి ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు వుంటుందని అన్నారు.