సిరా న్యూస్,కోనసీమ;
సఖినేటిపల్లి (మం) అంతర్వేదిపాలెం గ్రామంలో తాళం వేసిన ఇంటిలో చోరి జరిగింది. ఇంటి యజమాని చెరుకువాడశ్రీనివాస్ పనుల నిమిత్తం ఊరు వెళ్ళగా దొంగలు ఇంటిలోని చొరబడ్డారు. ఖరీదైన తలుపులను గునపాలతో బద్దలు కొట్టి బీరువాలో లాకర్ లో ఉన్న బంగారం,డబ్బులు దోచుకున్నారు. ఇంటి బయట పెరట్లో మద్యం సేవించి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఐదు కాసులు బంగారం, 30 వేల రూపాయల నగదు దోచుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.