దొంగల భయంతో కాలనీ వాసులు.
సిరా న్యూస్,మెదక్;
పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో పలు కాలనీలలో దొంగల హల్చల్ పేట మండలంలో గత కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు కాలనీలో సంచరిస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారు. పట్టపగలు కాలనీలో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను గమనిస్తూ రాత్రిపూట వాటిని టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. బుధవారం నాడు అర్ధరాత్రి ప్రియాంక కాలనీలో తాళాలు వేసిన రెండు ఇండ్లలో చోరికి పాల్పడ్డారని దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు సుమారు 25 వేల నగదు ఐదు తులాల వెండి ఆభరణాలు పోయాయని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి పట్టుకుంటామని పేట ఎస్సై శంకర్ తెలిపారు .
========