రాజేంద్రనగర్ లోరెచ్చిపోయిన దొంగలు

సిరాన్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ గూడ కేశవ్ నగర్ కాలనీ లో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి అందినకాడికి దోచుకున్నారు. రెండు తులాల బంగారం, వెండి ఆభరణాల తో పాటు ఒరిజినల్ ఇంటి పత్రాలను ఎత్తుకెళ్లారు. వరుసగా మూడు ఇండ్లకు బయటి నుండి గడియ పెట్టి పని కానిచ్చారు. బాధిత కుటుంబ వివాహం నిమిత్తం ఇంటికి తాళాలు వేసి కర్నూలు వెళ్లింది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *