సిరా న్యూస్,యాదాద్రి;
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి తర్వాత వరుసగా చోరీలు జరుగుతున్నాయి. -ప్రతిరోజు జిల్లాలో ఏదో ఒకచోట దొంగతనం ఘటన నమోదు అవుతోంది. నిద్రిస్తున్న మహిళలే లక్ష్యంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. మహిళల పుస్తెలతాడులను ఎత్తుకెళ్తున్నారు. గడచిన నెల రోజులుగా ఆరు బయట నిద్రిస్తున్న మహిళలే లక్ష్యంగా వరుసగా సంఘటనలు చోటు చేసుకున్నాయి. వరుస సంఘటనలతో.. పోలీసుల తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి.