సిరా న్యూస్,రంగారెడ్ది;
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామ సమీపంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది.లక్ష్మీనర్సిహ్మ స్వామి వారి పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు, వీటి విలువ సుమారుగా లక్ష రూపాయల మేర ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ తెలిపారు,గతంలో కూడా ఇక్కడ చోరీ జరిగిందని, తాళాలు పగలగొట్టి, హుండీ ఎత్తుకెళ్లారని, సమీపంలో తాళం చెవి ఉండడంతో దొంగలు సులువుగా ఎత్తుకెళ్లారని తెలుస్తుంది.ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మెన్ కృష్ణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసిపి కెపివి రాజు తెలిపారు.
======================