సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రభుత్వం మాజీ మంత్రి , బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కెటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అనేది చర్చనీయాంశమైంది. బిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కెటీఆర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ జరిగింది. కెటీఆర్ ఫామ్ హౌజ్ మీద డ్రోన్ కెమెరా ఎగిరిందన్న సాకుతో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడంలో కెటీఆర్ ముఖ్య భూమిక వహించారు. ఆధారాలు లేకుండానే అప్పట్లో రేవంత్ రెడ్డిని కటకటాల పాలు చేయడంలో కెటీఆర్ పాత్ర కీలకం. 2023 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అప్పటి ఫామ్ హౌజ్ ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి బాధితుడు. ప్రస్తుతం ఆ బాధితుడే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కెటీఆర్ . ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ 30, 2023న సంతకం చేసిన హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడంతో ఈవెంట్ రద్దయినట్లు వారు చెప్పారు. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావడంపై స్పందిస్తూకేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్యలకు నిదర్శనం అని విమర్శించారు. ఈ రేస్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, దేశానికి పెట్టుబడులు, కీర్తి వస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయన్నారు. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించడంతో.. స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.తెలంగాణ డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క ఫార్ములా ఈ స్కాం బయటపెట్టారు. ఫార్ములా ఈ రేస్ ట్రై పార్టీ అగ్రిమెంట్. రాష్ట్రానికి మేలు చేకూర్చే అగ్రిమెంట్ కాదు అని పరిశీలకులు అంటున్నారు. ఒక్క రూపాయి రాష్ట్రానికి లాభం లేకుండా చేసుకున్న అగ్రిమెంట్ ఇది. ఫీజు కట్టాల్సిన కంపెనీ టికెట్లు అమ్ముకుని వెళ్లిపోయింది. ఫార్ములా ఈ రేస్ కోసం 110 కోట్ల రూపాయలు కట్టకుండా వెళ్లిపోవడంతో ఆ భారం రాష్ట్రప్రభుత్వంపై పడింది. దీనివల్ల ప్రజలకు మేలు చేకూరే ప్రయోజనం శూన్యం. అయినా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ దోహదపడుతుందని కెటీఆర్ భావన. బిజినెస్ రూల్స్ కు విరుద్దంగా ఈ వ్యవహారం నడిచింది. వ్యక్తుల కోసం వ్యవస్థలను వాడుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక విడత 55 కోట్ల రూపాయలు కట్టబెట్టడంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కీలకపాత్ర పోషించారు. మంత్రి కెటీఆర్ ఆదేశం మేరకే తాను 55 కోట్ల రూపాయల ఫండ్ ను రిలీజ్ చేశానని అరవింద్ కుమార్ చెబుతున్నారు. 55 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలంటే కెబినెట్ ఆమోదం కంపల్రరీ. కెటీఆర్ బామ్మర్దికి లాభం చేకూర్చడానికి, కెటీఆర్ తనయుడు హిమాన్షు ఎంజాయ్ మెంట్ కోసం ఫార్ములా ఈ రేస్ దోహదపడిందని ప్రభుత్వం గుర్తించింది. లోకసభ ఎన్నికలకు ముందే కెటీఆర్ ను జైలుకు పంపించాలని తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది.