సిరాన్యూస్, బేల
క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం చేసిన తోకల క్రాంతి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బేధోడ గ్రామానికి చెందిన కెమేకర్ పార్వతి బాయి అనే మహిళ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన బాధితురాలికి వైద్యులు ఏ నెగటివ్ రక్తం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు.వెంటనే వారు అదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డిని సంప్రదించారు. ఆయన వెంటనే ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ కాలనీకి చెందిన తోకల క్రాంతి అనే యువకుడితో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయించారు.దీంతో అత్యవసర సమయంలో స్పందించిన సామ రుపేష్ రెడ్డి తో పాటు యువకుడికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో కుటుంబ సభ్యులు సంతోష్ తదితరులు ఉన్నారు.